రియాచక్రవర్తికి బెయిల్ మంజూరు
- October 07, 2020
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియాచక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో ... ఆ ఇద్దరినీ NCB అధికారులు సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. ఇదే కేసులో అరెస్టైన శామ్యూల్ మిరిండా, దీపేశ్ సావంత్లకూ.. కోర్టు బెయిల్ ఇచ్చింది. మరో డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ బాసిత్కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు వ్యతిరేకించింది. ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాకు.. దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది.
తనకు ఉన్న మాదకద్రవ్యాల అలవాటను కప్పిపుచ్చుకునేందుకు సుశాంత్ సింగ్.. తనను పావుగా వాడుకున్నట్టు... రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొంది. తన సోదరుడు షౌవిక్ను కూడా సుశాంత్ టార్గెట్ చేసినట్టు రియా పేర్కొంది. మరోవైపు... ఈ కేసులో నిన్ననే ప్రత్యేక కోర్టు రియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పెంచింది. ప్రస్తుతం బెయిల్ లభించడంతో.. రియా జైలు నుంచి బయటి ప్రపంచంలోకి రానుంది.
రియా వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా NCB ఆమెను... అరెస్టు చేసింది. డ్రగ్స్ సిండికేట్లో రియా యాక్టివ్ సభ్యురాలిగా ఉన్నట్టు... ఎన్సీబీ ఆరోపించింది. డ్రగ్స్ సరఫరా కోసం ఆర్థిక లావాదేవీలను రియా చూసినట్టు ఆరోపణలున్నాయి. అటు.. రియాతోపాటు సుశాంత్ మేనేజర్ సహా పలువురి వాట్సాప్ చాట్ల ఆధారంగా ప్రముఖ నటీమణులు రకుల్ ప్రీత్సింగ్, దీపికా పదుకునే, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్లను NCB అధికారులు విచారించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







