7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభం
- October 10, 2020
హైదరాబాద్: వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు డా.వంగూరి చిట్టెం రాజు ప్రారంభించారు. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల వేదికగా ప్రారంభమయ్యింది.ఈ రెండు రోజుల పాటు 32 గంటలు ఏకధాటిగా సదస్సు జరగనుంది. వీడియో జూమ్ ద్వారా జరిగే ఈ సదస్సును తెలుగు భాషను ప్రేమించే వారు ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా, ఏ సమయంలోనైనా వీక్షించొచ్చు.యూఏఈ నుంచి కూడా డా.కోడి రామారావు,డా.శ్రీరాములు కొప్పిశెట్టి,డా.నారాయణ దేవనపల్లి,ఆదిభట్ల కామేశ్వర శర్మ,కూరెళ్ల కోదండరాం,యామిని రాజశేఖర్ పాల్గొంటున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 200 మంది అతిథులు, వక్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. 15 పుస్తకావిష్కరణలు, వివిధ చర్చావేదికలతో ఆసక్తికరంగా కొనసాగనున్న ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ ఈ క్రింది లింకుల ద్వారా మీ ఇంటి నుంచే వీక్షించొచ్చు.
YouTube Links:
https://bit.ly/3is8lsy Vedika 1 to vedika 11
https://bit.ly/2EUJEHo
Vedika 12 to vedika 15
Facebook Links:
https://bit.ly/3itifu3
https://bit.ly/3nl0z7t
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









