7వ ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు ప్రారంభం

- October 10, 2020 , by Maagulf
7వ ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు ప్రారంభం

హైదరాబాద్‌: వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో ఏడ‌వ‌ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా శ‌నివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు డా.వంగూరి చిట్టెం రాజు ప్రారంభించారు. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల వేదికగా ప్రారంభమయ్యింది.ఈ రెండు రోజుల పాటు 32 గంటలు ఏకధాటిగా సదస్సు జరగనుంది. వీడియో జూమ్‌ ద్వారా జరిగే ఈ సదస్సును తెలుగు భాషను ప్రేమించే వారు ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా, ఏ సమయంలోనైనా వీక్షించొచ్చు.యూఏఈ నుంచి కూడా డా.కోడి రామారావు,డా.శ్రీరాములు కొప్పిశెట్టి,డా.నారాయణ దేవనపల్లి,ఆదిభట్ల కామేశ్వర శర్మ,కూరెళ్ల కోదండరాం,యామిని రాజశేఖర్ పాల్గొంటున్నారు. 

ప్ర‌పంచ నలుమూలల నుంచి సుమారు 200 మంది అతిథులు, వక్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. 15 పుస్తకావిష్కరణలు, వివిధ చర్చావేదికలతో ఆసక్తికరంగా కొనసాగనున్న ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ ఈ క్రింది లింకుల ద్వారా మీ ఇంటి నుంచే వీక్షించొచ్చు. 

YouTube Links:

https://bit.ly/3is8lsy Vedika 1 to vedika 11

https://bit.ly/2EUJEHo

Vedika 12 to vedika 15

Facebook Links:

https://bit.ly/3itifu3

https://bit.ly/3nl0z7t

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com