సంసారాన్ని...సముద్రంలో ముంచేసిన తండ్రి
- February 12, 2016
సిరియన్ దేశానికి చెందిన ముద్దులొలికే బుడతడు బూటుకాళ్ళతో బొక్కబోర్లాగా ఇసుకలో కూరికుపోయి చనిపోయిన హృదయవిదారమైన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నిర్ఘాంతపరచింది . ఇసిస్ ఉగ్రవాదుల చర్యలకు భీతిల్లిన నేపధ్యంలో అబ్దుల్లా కుర్ది తన భార్య రిహన, ఇరువురు కుమారులు అబ్దుల్లా ఘలేబ్ (4) , అయ్లన్ కుర్ది (3) కుటుంబంతో సహా నాటు పడవలో గ్ర్రేసు దేశానికి పారిపోతూ ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయారని అంతా భావించారు. మృతి చెందిన ఐదుగురులో మరో ఇరువురు వేరేవారు కాగా, తండ్రి అబ్దుల్లా కుర్ది సముద్రంలో ఈదుకొంటూ బతికినట్లు మీడియా కధనాలను ప్రచురించింది. కాగా ఈ తండ్రి ఎక్కువ మొత్తంలో కిరాయి తీసుకొని మనుష్యులను సిరియా నుంచి అక్రమంగా పలు ప్రాంతాలకు రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్ల బృందంలో ఒక ముఖ్య సభ్యుడని టర్కీ పోలీసులు విచారణలో తేలింది. ఈ నేరారోపణ రుజువైతే నాటుపడవతో కుటుంబంను చేజేతులారా చంపుకొన్న అబ్దుల్లా కుర్ది, మరో ఇద్దరు స్మగ్లర్లకు టర్కీ కోర్టు కనీసం 35 ఏళ్ళ జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







