సంసారాన్ని...సముద్రంలో ముంచేసిన తండ్రి
- February 12, 2016
సిరియన్ దేశానికి చెందిన ముద్దులొలికే బుడతడు బూటుకాళ్ళతో బొక్కబోర్లాగా ఇసుకలో కూరికుపోయి చనిపోయిన హృదయవిదారమైన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నిర్ఘాంతపరచింది . ఇసిస్ ఉగ్రవాదుల చర్యలకు భీతిల్లిన నేపధ్యంలో అబ్దుల్లా కుర్ది తన భార్య రిహన, ఇరువురు కుమారులు అబ్దుల్లా ఘలేబ్ (4) , అయ్లన్ కుర్ది (3) కుటుంబంతో సహా నాటు పడవలో గ్ర్రేసు దేశానికి పారిపోతూ ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయారని అంతా భావించారు. మృతి చెందిన ఐదుగురులో మరో ఇరువురు వేరేవారు కాగా, తండ్రి అబ్దుల్లా కుర్ది సముద్రంలో ఈదుకొంటూ బతికినట్లు మీడియా కధనాలను ప్రచురించింది. కాగా ఈ తండ్రి ఎక్కువ మొత్తంలో కిరాయి తీసుకొని మనుష్యులను సిరియా నుంచి అక్రమంగా పలు ప్రాంతాలకు రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్ల బృందంలో ఒక ముఖ్య సభ్యుడని టర్కీ పోలీసులు విచారణలో తేలింది. ఈ నేరారోపణ రుజువైతే నాటుపడవతో కుటుంబంను చేజేతులారా చంపుకొన్న అబ్దుల్లా కుర్ది, మరో ఇద్దరు స్మగ్లర్లకు టర్కీ కోర్టు కనీసం 35 ఏళ్ళ జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









