అమెరికా పాస్ పోర్టుదారులకు పదేళ్ల మల్టీ ఎంట్రీ వీసా ప్రకటించిన బహ్రెయిన్
- October 12, 2020
మనామా:అమెరికాతో దోస్తీని పెంచుకునే ప్రక్రియలో బహ్రెయిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పాస్ పోర్టు ఉన్నవారికి పదేళ్ల గడవు ఉండే మల్టీ ఎంట్రీ వీసా స్కీంను ప్రకటించింది. అంటే వీసా తీసుకున్న అమెరికన్లు ఈ పదేళ్లలో ఎప్పుడైనా బహ్రెయిన్ చేరుకోవచ్చు. బహ్రెయిన్ వచ్చిన ప్రతిసారి గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు అటోమెటిక్ గా అనుమతి ఉంటుంది. పదేళ్ల మల్టి ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అమెరికన్లుhttp://www.e-visa.gov.bh ద్వారా BD60 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలని బహ్రెయిన్ జాతీయ పాస్ పోర్ట్, నివాస వ్యవహారాల శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికా-బహ్రెయిన్ కుదుర్చుకున్న స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా బహ్రెయిన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయం మేరకు పదేళ్ల వీసా స్కీంను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదేసమయంలో అటు అమెరికా నుంచి ఇదే తరహాలో బహ్రెయిన్లకు ప్రధాన్యత ఉంటుందని, బహ్రెయిన్ వసూలు చేస్తున్న ఫీజుకు సమాన ఫీజుతో అమెరికా కూడా దీర్ఘకాల వీసాలు ఇస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









