భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసుల నమోదు
- October 15, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73 లక్షల 7 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 67,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 680 మంది మృతి చెందారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 71,760గా ఉంది.
దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,07,098 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,12,390 ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 63,83,442కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,11,266కి చేరింది. ఇక దేశంలో నిన్న 11,36,183 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 9,12,26,305 పరీక్షలు చేసినట్టు అయింది.
తాజా వార్తలు
- 3 గ్లోబల్ హెల్త్ అవార్డులను అందుకున్న ఒమన్
- పెంపుడు జంతువుతో ప్రయాణిస్తున్నారా? అనుమతి, ప్రక్రియ, వ్యాక్సిన్ల వివరాలు
- అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయ దుందుభి..
- ఖతార్ లో 1.2 మిలియన్ చదరపు మీటర్ల గ్రీనరీ పునరుద్ధరణ
- కువైట్ కొత్త క్రౌన్ ప్రిన్స్గా షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబా
- సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారం..ఇద్దరు అరెస్ట్
- దుబాయ్ లో సింగిల్ యూజ్ బ్యాగ్లపై నిషేధం ప్రారంభం
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం