కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించిన బహ్రెయిన్
- October 16, 2020మనామా:కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుల్తానేట్ పరిధిలో ట్రయల్ బేస్ గా దాదాపు 20 వేల మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధానంగా టీచర్లు, విద్యార్ధులు, వైద్య సిబ్బంది, కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ప్రధామిక వైద్య కేంద్రాల్లోని ల్యాబ్ టెక్నిషియన్లకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముక్కులో నుంచి నమూనాలను సేకరించి కేవలం 15 ననిమిషాల్లోనే ఫలితాలను రాబొట్టచ్చని, అదీ కూడా ఎలాంటి ప్రత్యేకమైన ల్యాబ్ కూడా అవసరం లేకుండా పరీక్షలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే..ర్యాపిడ్ టెస్ట్ ఫలితాలు పూర్తిగా పీసీఆర్ టెస్ట్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. కానీ, ర్యాపిడ్ టెస్టు ద్వారా చాలా సమయం ఆదా అవటంతో పాటు ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం