కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించిన బహ్రెయిన్
- October 16, 2020
మనామా:కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుల్తానేట్ పరిధిలో ట్రయల్ బేస్ గా దాదాపు 20 వేల మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధానంగా టీచర్లు, విద్యార్ధులు, వైద్య సిబ్బంది, కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ప్రధామిక వైద్య కేంద్రాల్లోని ల్యాబ్ టెక్నిషియన్లకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముక్కులో నుంచి నమూనాలను సేకరించి కేవలం 15 ననిమిషాల్లోనే ఫలితాలను రాబొట్టచ్చని, అదీ కూడా ఎలాంటి ప్రత్యేకమైన ల్యాబ్ కూడా అవసరం లేకుండా పరీక్షలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే..ర్యాపిడ్ టెస్ట్ ఫలితాలు పూర్తిగా పీసీఆర్ టెస్ట్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. కానీ, ర్యాపిడ్ టెస్టు ద్వారా చాలా సమయం ఆదా అవటంతో పాటు ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







