కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించిన బహ్రెయిన్

- October 16, 2020 , by Maagulf
కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించిన బహ్రెయిన్

మనామా:కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుల్తానేట్ పరిధిలో ట్రయల్ బేస్ గా దాదాపు 20 వేల మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధానంగా టీచర్లు, విద్యార్ధులు, వైద్య సిబ్బంది, కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ప్రధామిక వైద్య కేంద్రాల్లోని ల్యాబ్ టెక్నిషియన్లకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముక్కులో నుంచి నమూనాలను సేకరించి కేవలం 15 ననిమిషాల్లోనే ఫలితాలను రాబొట్టచ్చని, అదీ కూడా ఎలాంటి ప్రత్యేకమైన ల్యాబ్ కూడా అవసరం లేకుండా పరీక్షలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే..ర్యాపిడ్ టెస్ట్ ఫలితాలు పూర్తిగా పీసీఆర్ టెస్ట్ కు ప్రత్యామ్నాయం  మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. కానీ, ర్యాపిడ్ టెస్టు ద్వారా చాలా సమయం ఆదా అవటంతో పాటు ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com