తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ
- October 16, 2020
హైదరాబాద్:నేడు హైదరాబాదులోని అశోక్ నగర్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర బాధ్యులు ఈ సంవత్సరం రికార్డు చేసిన 8 సాంప్రదాయ బతుకమ్మ చప్పట్ల పాటల సీడీని ఆవిష్కరించారు. జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సూచన మేరకు రూపకల్పన చేసిన ఈ సీడీలోని పాటలను కవి, రచయిత కోదారి శ్రీను సేకరించగా ప్రముఖ గాయనిలు తేలు విజయ, పద్మావతి, వరం తదితరులు పాడారు. అలాగే మహిళలకు పాడుకోడానికి అనుకూలంగా ఉండేలా ఇప్పటి వరకు జాగృతి తయారు చేసిన సీడీలలోని బతుకమ్మ పాటలతో ముద్రించిన బతుకమ్మ పాటల పాకెట్ సైజ్ పుస్తకాలను కూడా ఆవిష్కరించారు.
అలాగే మూడు ప్రత్యేక బతుకమ్మ గీతాలను కూడా నేడు విడుదల చేసారు. దామోదర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఈ మూడు గీతాలకు రచన, సేకరణ కోదారి శ్రీను, సంగీతం వేణు, గానం తేలు విజయ, పద్మావతి, స్ఫూర్తి, వరం. ఈ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, వరలక్ష్మి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, కార్యదర్శి రజిత, హైదరాబాదు అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, రంగారెడ్డి అధ్యక్షులు అర్చన సేనాపతి, మేడ్చల్ అధ్యక్షులు ఈగ సంతోష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!