16 ఏళ్లకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ వాసి

- October 17, 2020 , by Maagulf
16 ఏళ్లకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ వాసి

దుబాయ్:దుబాయ్ లో 16 సంవత్సరాల నుండి నివసిస్తున్న మాట్లా భూమయ్య తెలంగాణకు చెందిన రేగుంట గ్రామస్థుడు జగిత్యాల జిల్లా వాసి శుక్రవారం రోజు దుబాయ్ నుండి  హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే మాట్లా భూమయ్య.. కోరేపు మల్లేష్(GWAC ఉపాధ్యక్షులు) ను కలిసి తన సమస్యని వివరించడం జరిగింది.కోరేపు మల్లేష్ వెంటనే స్పందించి  జైత నారాయణ(సోషల్ వర్కర్)కి సమాచారం అందించారు.మాట్లా భూమయ్య కి దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మరియు ఇండియన్ కాన్సులేట్ అధికారుల నుండి అనుమతి పత్రాలు ఇప్పించి తన సొంత గ్రామానికి పంపడం జరిగింది.భూమయ్య కుటుంబ సభ్యులు జైత నారాయణ,కోరేపు మల్లేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com