కార్లలో ఒంటరిగా చిన్నారుల్ని వదిలేస్తే అది నేరమే
- October 17, 2020దుబాయ్: చిన్న పిల్లల్ని ఒంటరిగా కార్లలో వదిలేస్తే, అది నేరమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. పిల్లల్ని అలా కార్లలో వదిలేయడం వల్ల, వేసవిలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అంటున్నారు దుబాయ్ పోలీసులు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ ట్వీట్ ద్వారా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ని అప్రమత్తం చేస్తున్నారు. 2019 నవంబర్లో ఇద్దరు చిన్నారులు అబుదాబీలో చనిపోయారు. కారులో చిన్నారుల్ని తల్లిదండ్రులు వదిలేయగా, ఆ కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 2007 నుంచి ఈ తరహా ఘటనల్లో 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వదీమా చట్టం ప్రకారం, పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయి. 18 ఏళ్ళ లోపు చిన్నారుల విషయంలో ఇది వర్తిస్తుంది. జైలు శిక్ష, అలాగే జరీమానా ఈ ఉల్లంఘనకు విధిస్తారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..