కార్లలో ఒంటరిగా చిన్నారుల్ని వదిలేస్తే అది నేరమే
- October 17, 2020
దుబాయ్: చిన్న పిల్లల్ని ఒంటరిగా కార్లలో వదిలేస్తే, అది నేరమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. పిల్లల్ని అలా కార్లలో వదిలేయడం వల్ల, వేసవిలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అంటున్నారు దుబాయ్ పోలీసులు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ ట్వీట్ ద్వారా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ని అప్రమత్తం చేస్తున్నారు. 2019 నవంబర్లో ఇద్దరు చిన్నారులు అబుదాబీలో చనిపోయారు. కారులో చిన్నారుల్ని తల్లిదండ్రులు వదిలేయగా, ఆ కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 2007 నుంచి ఈ తరహా ఘటనల్లో 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వదీమా చట్టం ప్రకారం, పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయి. 18 ఏళ్ళ లోపు చిన్నారుల విషయంలో ఇది వర్తిస్తుంది. జైలు శిక్ష, అలాగే జరీమానా ఈ ఉల్లంఘనకు విధిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









