కార్లలో ఒంటరిగా చిన్నారుల్ని వదిలేస్తే అది నేరమే
- October 17, 2020
దుబాయ్: చిన్న పిల్లల్ని ఒంటరిగా కార్లలో వదిలేస్తే, అది నేరమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. పిల్లల్ని అలా కార్లలో వదిలేయడం వల్ల, వేసవిలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అంటున్నారు దుబాయ్ పోలీసులు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ ట్వీట్ ద్వారా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ని అప్రమత్తం చేస్తున్నారు. 2019 నవంబర్లో ఇద్దరు చిన్నారులు అబుదాబీలో చనిపోయారు. కారులో చిన్నారుల్ని తల్లిదండ్రులు వదిలేయగా, ఆ కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 2007 నుంచి ఈ తరహా ఘటనల్లో 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వదీమా చట్టం ప్రకారం, పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయి. 18 ఏళ్ళ లోపు చిన్నారుల విషయంలో ఇది వర్తిస్తుంది. జైలు శిక్ష, అలాగే జరీమానా ఈ ఉల్లంఘనకు విధిస్తారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







