క్వారంటైన్ గడువు సమయంలోనూ దేశం విడిచి వెళ్లేందుకు కువైట్ అనుమతి
- October 18, 2020కువైట్ సిటీ:కువైట్ చేరుకునే ప్రయాణికులు, ప్రవాసీయులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. కువైట్ ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు సుల్తానేట్ కు చేరుకునే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. అయితే..సదరు ప్రయాణికుడు తాను తిరిగి తన దేశం వెళ్లాలని అనుకుంటే..వారు క్వారంటైన్ గడువు సమయంలోనూ నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్లొచ్చని తెలిపింది. దేశం విడిచి వెళ్లే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టు అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని కూడా సూచించింది. అయితే..కోవిడ్ లక్షణాలు ఉంటే మాత్రం ప్రయాణానికి అనుమతించరు. ఇదిలాఉంటే..కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 34 దేశాల నుంచి విమాన ప్రయాణాలపై విధించిన నిషేధం యధావిధిగా కొనసాగుతుంది.
--దివాకర్(మాగాల్ఫా ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ