కోవిడ్-19: షార్జా కార్మిక నివాసాల్లో సోదాలు..4 నెలల్లో 21 వేల ఫైన్లు
- October 18, 2020షార్జా:షార్జాలో కార్మికులు ఉంటున్న నివాస ప్రాంతాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జన సమూహఆల కారణంగా కోవిడ్ 19 ప్రబలకుండా ఉండేందుకు కార్మికుల నివాస ప్రాంతాలపై షార్జా అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఒక్కో గదిలో పరిమితికి మించి ఎక్కువ మంది కార్మికులు ఉండకూడదని గతంలోనే నిబంధనలు విధించింది. పరిమిత సంఖ్యకు మించి ఒక్కో గదిలో ఎక్కువ మంది ఉంటే జరిమానాలు తప్పవని హెచ్చరించిన అత్యవసర, ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు..కార్మికుల నివాస ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మే 20 నుంచి ఆక్టోబర్ 1 వరకు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 21 వేల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వివరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో 6,959 ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు సంబంధించి కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు అన్ని భాషలలో విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల