తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు
- October 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. ఇక నిన్న రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,436 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,22,111కు చేరుకుంది. కరోనాతో నిన్న ఒక్క రోజే 6 మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,271కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,050 యాక్టివ్ కేసులున్నాయి. 1,98,790 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 2,154 మంది డిశ్చార్జ్ అయ్యారు..ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక అత్యధికంగా GHMC పరిధిలో నిన్న 249 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41, 043 టెస్టులను నిర్వహించగా, టెస్టుల సంఖ్య 38,30,503కి చేరుకుంది.
అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 9,70,173 పరీక్షలు చేయగా, 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 1033 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,14,031కు చేరుకుంది. ఇక నిన్న దేశ వ్యాప్తంగా 72,614 మంది డిశ్ఛార్జి కాగా ఈ సంఖ్య 65,97,210కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









