కోవిడ్-19: షార్జా కార్మిక నివాసాల్లో సోదాలు..4 నెలల్లో 21 వేల ఫైన్లు
- October 18, 2020
షార్జా:షార్జాలో కార్మికులు ఉంటున్న నివాస ప్రాంతాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జన సమూహఆల కారణంగా కోవిడ్ 19 ప్రబలకుండా ఉండేందుకు కార్మికుల నివాస ప్రాంతాలపై షార్జా అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఒక్కో గదిలో పరిమితికి మించి ఎక్కువ మంది కార్మికులు ఉండకూడదని గతంలోనే నిబంధనలు విధించింది. పరిమిత సంఖ్యకు మించి ఒక్కో గదిలో ఎక్కువ మంది ఉంటే జరిమానాలు తప్పవని హెచ్చరించిన అత్యవసర, ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు..కార్మికుల నివాస ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మే 20 నుంచి ఆక్టోబర్ 1 వరకు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 21 వేల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వివరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో 6,959 ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు సంబంధించి కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు అన్ని భాషలలో విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









