తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు
- October 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. ఇక నిన్న రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,436 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,22,111కు చేరుకుంది. కరోనాతో నిన్న ఒక్క రోజే 6 మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,271కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,050 యాక్టివ్ కేసులున్నాయి. 1,98,790 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 2,154 మంది డిశ్చార్జ్ అయ్యారు..ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక అత్యధికంగా GHMC పరిధిలో నిన్న 249 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41, 043 టెస్టులను నిర్వహించగా, టెస్టుల సంఖ్య 38,30,503కి చేరుకుంది.
అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 9,70,173 పరీక్షలు చేయగా, 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 1033 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,14,031కు చేరుకుంది. ఇక నిన్న దేశ వ్యాప్తంగా 72,614 మంది డిశ్ఛార్జి కాగా ఈ సంఖ్య 65,97,210కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు