ఏ.పి ‌లో కొత్తగా 3,986 కరోనా పాజిటివ్ కేసులు

- October 18, 2020 , by Maagulf
ఏ.పి ‌లో కొత్తగా 3,986 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏ.పి ‌లో గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986 పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132 కు చేరింది. కొత్తగా 23 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,429కి చేరింది. ఈ మేరకు  ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,591మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 70,66,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,474యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com