దేశ పౌరులకు మాత్రమే శీతాకాలపు వ్యాక్సిన్..ప్రకటించిన కువైట్
- October 18, 2020
కువైట్ సిటీ:ప్రతి ఏడాది వేసే శీతాకాలపు వ్యాక్సిన్ విషయంలో కువైట్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 2020-2021కి సంబంధించి శీతాకాలపు వ్యాక్సిన్ కేవలం దేశ పౌరులకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రకటించింది. సీజన్ వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు రోగ నిరోధక శక్తి పెంచేలా వ్యాక్సిన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాక్టిరియా కారణంగా సక్రమించే వ్యాధులను ఎదుర్కోవటంలోనూ వ్యాక్సిన్ ప్రయోజనకారిగా ఉంటుందని వెల్లడించారు. దేశంలోని ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే తమ అభిలాష అయినా..ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు దేశ పౌరులను మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!









