దేశ పౌరులకు మాత్రమే శీతాకాలపు వ్యాక్సిన్..ప్రకటించిన కువైట్

- October 18, 2020 , by Maagulf
దేశ పౌరులకు మాత్రమే శీతాకాలపు వ్యాక్సిన్..ప్రకటించిన కువైట్

కువైట్ సిటీ:ప్రతి ఏడాది వేసే శీతాకాలపు వ్యాక్సిన్ విషయంలో కువైట్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 2020-2021కి సంబంధించి శీతాకాలపు వ్యాక్సిన్ కేవలం దేశ పౌరులకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రకటించింది. సీజన్ వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు రోగ నిరోధక శక్తి పెంచేలా వ్యాక్సిన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాక్టిరియా కారణంగా సక్రమించే వ్యాధులను ఎదుర్కోవటంలోనూ వ్యాక్సిన్ ప్రయోజనకారిగా ఉంటుందని వెల్లడించారు. దేశంలోని ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే తమ అభిలాష అయినా..ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు దేశ పౌరులను మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com