రీ - ఓపెన్ తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి 332,000 మంది ప్రయాణం
- October 19, 2020
కువైట్: కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్డౌన్ తర్వాత, పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో ఆగస్ట్ నుంచి విమాన రాకపోకలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా 80 రోజుల్లో 197,000 మంది ప్రయాణీకులు కువైట్ నుంచి డిపోర్ట్ అయ్యారు. కాగా, ఇదే సమయంలో మొత్తం 135,000 మంది ప్రయాణీకులు కువైట్కి వచ్చారు. మొత్తం 1965 విమాన సర్వీసులు నడవగా, వివిధ సంస్థలు విమానాల్ని ఆపరేట్ చేశాయి. ఫస్ట్ ఫేజ్లో 30 శాతం మించకుండానే ప్రయాణాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా టర్కీ, దుబాయ్ మరియు దోహాలకు విమానాలు ఎక్కువగా నడిచాయి. కాగా, నిషేధ జాబితాలో వున్న 34 దేశాల నుంచి ప్రయాణీకులు కువైట్కి రావాలనుకుంటే పిసిఆర్ సర్టిఫికెట్ తప్పనిసరి. 72 గంటల ముందుగా పిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. కువైట్కి వచ్చిన తర్వాత 14 రోజుల హోం క్వారంటైన్ వీరికి తప్పనిసరి.
తాజా వార్తలు
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!









