రీ - ఓపెన్ తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి 332,000 మంది ప్రయాణం
- October 19, 2020
కువైట్: కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్డౌన్ తర్వాత, పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో ఆగస్ట్ నుంచి విమాన రాకపోకలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా 80 రోజుల్లో 197,000 మంది ప్రయాణీకులు కువైట్ నుంచి డిపోర్ట్ అయ్యారు. కాగా, ఇదే సమయంలో మొత్తం 135,000 మంది ప్రయాణీకులు కువైట్కి వచ్చారు. మొత్తం 1965 విమాన సర్వీసులు నడవగా, వివిధ సంస్థలు విమానాల్ని ఆపరేట్ చేశాయి. ఫస్ట్ ఫేజ్లో 30 శాతం మించకుండానే ప్రయాణాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా టర్కీ, దుబాయ్ మరియు దోహాలకు విమానాలు ఎక్కువగా నడిచాయి. కాగా, నిషేధ జాబితాలో వున్న 34 దేశాల నుంచి ప్రయాణీకులు కువైట్కి రావాలనుకుంటే పిసిఆర్ సర్టిఫికెట్ తప్పనిసరి. 72 గంటల ముందుగా పిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. కువైట్కి వచ్చిన తర్వాత 14 రోజుల హోం క్వారంటైన్ వీరికి తప్పనిసరి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







