రీ - ఓపెన్‌ తర్వాత కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 332,000 మంది ప్రయాణం

- October 19, 2020 , by Maagulf
రీ - ఓపెన్‌ తర్వాత కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 332,000 మంది ప్రయాణం

కువైట్: కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్‌డౌన్‌ తర్వాత, పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో ఆగస్ట్‌ నుంచి విమాన రాకపోకలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ నుంచి ఇప్పటిదాకా 80 రోజుల్లో 197,000 మంది ప్రయాణీకులు కువైట్‌ నుంచి డిపోర్ట్‌ అయ్యారు. కాగా, ఇదే సమయంలో మొత్తం 135,000 మంది ప్రయాణీకులు కువైట్‌కి వచ్చారు. మొత్తం 1965 విమాన సర్వీసులు నడవగా, వివిధ సంస్థలు విమానాల్ని ఆపరేట్‌ చేశాయి. ఫస్ట్‌ ఫేజ్‌లో 30 శాతం మించకుండానే ప్రయాణాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా టర్కీ, దుబాయ్‌ మరియు దోహాలకు విమానాలు ఎక్కువగా నడిచాయి. కాగా, నిషేధ జాబితాలో వున్న 34 దేశాల నుంచి ప్రయాణీకులు కువైట్‌కి రావాలనుకుంటే పిసిఆర్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. 72 గంటల ముందుగా పిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి వుంటుంది. కువైట్‌కి వచ్చిన తర్వాత 14 రోజుల హోం క్వారంటైన్‌ వీరికి తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com