నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ..
- October 20, 2020ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ ప్రసంగానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియదు. మార్చిలో లాక్డౌన్ విధించిన నాటి నుంచి పలు మార్లు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. దేశ ప్రజలకు తానో విషయం చెప్పనున్నట్లు ప్రధాని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు. అయితే ఆ ప్రసంగాన్ని అందరూ ఆలకించాలన్నారు. ఏ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడుతారో దాని గురించి ఆ ట్వీట్లో వెల్లడించలేదు. కానీ కరోనా గురించి ఇటీవల పలుసార్లు మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే గత మూడు నెలల నుంచి తొలిసారి ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల లోపు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం తన ట్వీట్లో ఈ విషయాన్ని చెప్పింది.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
— Narendra Modi (@narendramodi) October 20, 2020
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు