బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్
- October 20, 2020బాలకృష్ణ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల' ఫస్ట్లుక్ వచ్చేసింది. అర్జునుడి గెటప్లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. 'నర్తనశాల'లో ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్బాబు కనిపించనున్నారు.
తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో 'నర్తనశాల' అంటే బాలయ్యకు చాలా ఇష్టం. అందుకే దాన్ని రీమేక్ చేయాలని సంకల్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. . 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు