ఖర్చులు పెరగడంతో బహ్రెయిన్ నిర్వాసితుల ఇబ్బందులు
- February 14, 2016
వివిధ రాయితీలు తొలగించడంతో పెరిగిన ఖర్చుల కారణంగా బహ్రెయిన్ లో నిర్వాసితుల జీవనం ఎంతో దుర్బరంగా మారుతోంది. గత ఎనిమిదేళ్లుగా బహ్రెయిన్ లో నివసిస్తున్న అమీన్ నసీరుద్దీన్ ఈ ఏడాది చివరిలోపు దేశం విడిచి వెళ్లేందుకు నిర్ణయం తిసుకొన్నట్లు తెలిపాడు. పేరు తెలియచేయడానికి ఇష్టపడని మరో నిర్వాసితుడు పెరిగిన ధరల కారణంగా తనతో ఉంటున్న కుటుంబాన్ని తిరిగి స్వదేశంకు పంపుతున్నట్లు తెలిపాడు. అత్యధిక శాతం మంది బహ్రెయిన్ నిర్వాసితులు పెరిగిన ధరల కారణంగా తాము విదేశంలో ఉండాలా లేక స్వదేశం కు తిరిగి వెళ్ళాలో నిర్ణయించుకోలేక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. తక్కువ ఆదాయాలు ఉన్న ఉద్యోగులు , సాధారణ కార్మికులు పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఇంటి అద్దెలు , నెలవారీ బిల్లులు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నారు. అదే సమయంలో జీతం డబ్బులలో కొంత మొత్తాన్ని స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు పంపించేందుకు అవస్థలు చెందుతున్నారు. పెరిగిన ఖర్చులు తమ అల్ప జీతాలను హరించివేస్తున్నాయని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్బంగా వలస కార్మికుల రక్షణ సంఘం ( ఎం.డబ్ల్యూ.పి.ఎస్.) అధ్యక్షురాలు మరిఎత్త దాస్ మాట్లాడుతూ , పలువురు బహ్రెయిన్ నిర్వాసితులు బాద్యతల కారణంగా ఇదే దేశంలో ఉండిపోక తప్పడం లేదని తెలిపారు. వీరు అప్పులు తీర్చడానికి, కుటుంబ భారం మోయాల్సిన నేపధ్యంలో బహ్రెయిన్ విదిచివెళ్ళలేక ఇక్కడే ఉండిపోతున్నారని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







