34 దేశాలకు చెందినవారికి డైరెక్ట్ ఎంట్రీ
- October 22, 2020
కువైట్ సిటీ:మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బాసిల్ అల్ సబా, కువైట్ ఎయిర్ వేస్ అలాగే జజీరా ఎయిర్ వేస్ ప్రతినిథులతో ఈ రోజు సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రెండు కంపెనీల నుంచి 34 దేశాలకు డైరెక్ట్ విమానాలు నడిపే విషయమై చర్చలు జరపనున్నారు. 14 రోజుల క్వారంటైన్ నిబంధనలతో సంబంధం లేకుండా విమానాలు నడిపే విషయమై ఈ సమావేశంలో చర్చిస్తారు. నిషేధిత 34 దేశాలకు చెందిన ప్రయాణీకుల విషయమై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. కాగా, ఆయా రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్లో పిసిఆర్ టెస్ట్ చేస్తారు. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్ విధిస్తారు. అయితే, ఈ క్వారంటైన్ని ఏడు రోజులకు కుదించాలన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







