వీసా నిబంధనలు సడలించిన భారత్

- October 22, 2020 , by Maagulf
వీసా నిబంధనలు సడలించిన భారత్

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇవాళ వీసా నిబంధనలను సడలించింది. అన్ని వర్గాల విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే పర్యాటకం కోసం భారత్‌లో విజిట్ చేసేందుకు విదేశీయులకు అనుమతి ఇవ్వలేదు. ఓసీఐ, పీఐఓ కార్డులు ఉన్నవారితో పాటు విదేశీయులకు ఈ అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. పౌర విమానయానశాఖ ఆమోదించిన విమానాలకు మాత్రమే ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్‌, టూరిస్ట్‌, మెడికల్ వీసాలు తప్ప ఇతర అన్ని వీసాలను పునరుద్దరిస్తున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొన్నది. తాజా ఆదేశాలతో... బిజినెస్‌, కాన్ఫరెన్స్‌, ఉద్యోగం, విద్య, పరిశోధన, వైద్య సంబంధిత విషయాలకు హాజరయ్యేందుకు విదేశీయులకు అనుమతి ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com