కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీపై దేశబహిష్కరణ

- October 23, 2020 , by Maagulf
కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీపై దేశబహిష్కరణ

మస్కట్:కరోనా వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది ఒమన్. మార్గనిర్దేశకాలను పాటించకుండా వైరస్ వ్యాప్తికి దోహదపడేట్లు చేస్తున్న వ్యక్తులను గుర్తించి ఇప్పటికే భారీ జరిమానాలను విధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించిన నేరానికి ఓ ప్రవాసీయుడిపై ఏకంగా దేశ బహిష్కరణ వేటు పడింది. పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో నిందితుడు తన నివాసంలో అహార పదార్ధాలను విక్రయించాడన్నది అధికారుల ఆరోపణ. దీంతో అతన్ని అరెస్ట్ చేసి న్యాయవిచారణకు తరలించారు. విచారణ జరిపిన ధోఫర్ ప్రాథమిక న్యాయస్థానం నిందితుడికి నెల రోజుల జైలు శిక్షతో పాటు శిక్షా కాలం పూర్తవగానే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com