కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీపై దేశబహిష్కరణ
- October 23, 2020
మస్కట్:కరోనా వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది ఒమన్. మార్గనిర్దేశకాలను పాటించకుండా వైరస్ వ్యాప్తికి దోహదపడేట్లు చేస్తున్న వ్యక్తులను గుర్తించి ఇప్పటికే భారీ జరిమానాలను విధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించిన నేరానికి ఓ ప్రవాసీయుడిపై ఏకంగా దేశ బహిష్కరణ వేటు పడింది. పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో నిందితుడు తన నివాసంలో అహార పదార్ధాలను విక్రయించాడన్నది అధికారుల ఆరోపణ. దీంతో అతన్ని అరెస్ట్ చేసి న్యాయవిచారణకు తరలించారు. విచారణ జరిపిన ధోఫర్ ప్రాథమిక న్యాయస్థానం నిందితుడికి నెల రోజుల జైలు శిక్షతో పాటు శిక్షా కాలం పూర్తవగానే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







