బెంగుళూరు పై చెన్నై విజయం
- October 25, 2020
దుబాయ్:ఐపీఎల్ 2020 లో ఈ రోజు మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ తో సాధించడంతో ఆ జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇక 146 పరుగుల టార్గెట్ తో వచ్చిన చెన్నై జట్టు ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (25) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు 39 పరుగులకు పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ అప్పటికే గ్రౌండ్ లో నిలదొక్కుకున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (65) అలాగే కెప్టెన్ ధోని(19) పరుగులు చేసి మరో వికెట్ పడకుండా జట్టును 18.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. ఇది చెన్నైకి ఈ సీజన్ లో నాలుగో విజయం అయితే బెంగళూరు నాలుగో పరాజయం. ఇక ఈ గెలుపుతో చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుండి 7వ స్థానానికి వస్తే బెంగళూరు అదే మూడో స్థానం లో ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







