బెంగుళూరు పై చెన్నై విజయం
- October 25, 2020దుబాయ్:ఐపీఎల్ 2020 లో ఈ రోజు మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ తో సాధించడంతో ఆ జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇక 146 పరుగుల టార్గెట్ తో వచ్చిన చెన్నై జట్టు ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (25) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు 39 పరుగులకు పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ అప్పటికే గ్రౌండ్ లో నిలదొక్కుకున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (65) అలాగే కెప్టెన్ ధోని(19) పరుగులు చేసి మరో వికెట్ పడకుండా జట్టును 18.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. ఇది చెన్నైకి ఈ సీజన్ లో నాలుగో విజయం అయితే బెంగళూరు నాలుగో పరాజయం. ఇక ఈ గెలుపుతో చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుండి 7వ స్థానానికి వస్తే బెంగళూరు అదే మూడో స్థానం లో ఉంది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ