బహ్రెయిన్:హిట్ అండ్ రన్ కేసులో వాహనదారుడికి రిమాండ్
- October 28, 2020
మనామా:దురుసుగా డ్రైవింగ్ చేసి నలుగురు మృతికి కారణమైన వాహదారుడిని మరింత విచారించేందుకు అనువుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 19న
బురి వెళ్లే దారిలో హమాలా సమీపంలో వలి అల్ అహద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 21 ఏళ్ల వ్యక్తి..అజాగ్రత్తగా, అతివేగంగా కారు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. హైవే అతివేగంగా కారును నడిపిన యువకుడు...నిబంధనలకు విరుద్ధంగా ఎదుటి వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో కారు అదుపు తప్పటంతో డివైడర్ ను ఢీ కొని అవతలి వైపు ఉన్న రోడ్డులో మరో వాహనాన్ని ఢికొట్టిందని వివరించారు. ప్రమాదంపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







