ఆరుగుర్ని కాల్చి చంపిన సౌదీ టీచర్
- February 14, 2016
సౌదీ టీచర్ అబ్దుల్లా అల్ మలికి, ఆరుగురు సహచరుల్ని గత గురువారం మెషీన్ గన్తో చంపిన ఘటన అరబ్ పౌరుల్ని షాక్కి గురిచేసింది. వ్యక్తిగత విభేదాలే ఈ దారుణానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. సూపర్వైజర్తో నిందితుడికి గొడవలున్నాయనీ, అవే ఈ స్థాయిలో ఘాతుకానికి పాల్పడేలా చేశాయని అంటున్నారు. 'నా చుట్టూ వున్నవారెవరూ నిజాయితీపరులు కాదు. వారికి నీతి లేదు. నాకు నిజం తెలియాలి' అంటూ తనతో నిందితుడు ఘటన జరగడానికి ముందు చెప్పినట్లు స్కూల్ హెడ్మాస్టర్ అహ్మద్ జబ్బర్ వివరించారు. అతనిలో ఈ విపరీత ప్రవర్తనను అప్పుడు అంచనా వేయలేకపోయానని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా నిందితుడికి ఎవరితోనూ గొడవలు లేవనీ, ఏదో మానసిక సమస్యతో ఈ పని చేసి ఉంటాడని కూడా అనుమానిస్తున్నారు కొందరు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







