ఆరుగుర్ని కాల్చి చంపిన సౌదీ టీచర్‌

- February 14, 2016 , by Maagulf
ఆరుగుర్ని కాల్చి చంపిన సౌదీ టీచర్‌

సౌదీ టీచర్‌ అబ్దుల్లా అల్‌ మలికి, ఆరుగురు సహచరుల్ని గత గురువారం మెషీన్‌ గన్‌తో చంపిన ఘటన అరబ్‌ పౌరుల్ని షాక్‌కి గురిచేసింది. వ్యక్తిగత విభేదాలే ఈ దారుణానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. సూపర్‌వైజర్‌తో నిందితుడికి గొడవలున్నాయనీ, అవే ఈ స్థాయిలో ఘాతుకానికి పాల్పడేలా చేశాయని అంటున్నారు. 'నా చుట్టూ వున్నవారెవరూ నిజాయితీపరులు కాదు. వారికి నీతి లేదు. నాకు నిజం తెలియాలి' అంటూ తనతో నిందితుడు ఘటన జరగడానికి ముందు చెప్పినట్లు స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ అహ్మద్‌ జబ్బర్‌ వివరించారు. అతనిలో ఈ విపరీత ప్రవర్తనను అప్పుడు అంచనా వేయలేకపోయానని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా నిందితుడికి ఎవరితోనూ గొడవలు లేవనీ, ఏదో మానసిక సమస్యతో ఈ పని చేసి ఉంటాడని కూడా అనుమానిస్తున్నారు కొందరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com