సముద్రంలో తప్పిపోయిన ఫిషర్మెన్ దొరికారు
- February 14, 2016
ముగ్గురు భారతీయ వలస ఫిషర్మెన్ సముద్రంలో తమ బోటుతో సహా గల్లంతయిన ఘటన ఆందోళన కలిగించింది. అయితే ఆ ముగ్గురినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. గత మంగళవారం తప్పిపోయిన వీరిని నిన్న రక్షించారు. బోట్ కెప్టెన్ జస్టిన్, ఫిషర్మెన్ ముత్క్కులి పిచాయ్, తమిళ మారన్ సముద్రంలో తప్పిపోగా, కోస్ట్గార్డ్ సహకారంతో మూడు ఫిషింగ్ బోట్స్ వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి, వారిని కనుగొన్నారు. సుమారు 500 మంది ఫిషర్మెన్ సిట్రాలో పనిచేస్తుంటారు. ఇందులో చాలామంది భారతదేశంలోని తమిళనాడుకు చెందినవారు. బోట్ ఇంజిన్ పాడయినట్లుగా తమకు సమాచారం లభించడంతో అధికారులకు సమాచారమిచ్చినట్లు తమిళ మారన్ తండ్రి చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఫిషర్మెన్ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







