భారత్ కు గిఫ్ట్, పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ప్రభుత్వం

- October 29, 2020 , by Maagulf
భారత్ కు గిఫ్ట్, పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ప్రభుత్వం

రియాద్:భారత్ కు సౌదీ అరేబియా ‘దీపావళి గిఫ్ట్’ ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది.నవంబరు 21-22 తేదీల్లో జీ-20 సమ్మిట్ ను నిర్వహించనున్నసందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటుపై మొదట ఈ మ్యాప్ ను ముద్రించినప్పటికీ ఆ తరువాత తొలగించారు. తొలుత  ఈ భూభాగాలను పాక్ లో ఉన్నట్టు చూపారని, కానీ ఆ తరువాత తొలగించడం చూస్తే ఇది ఇండియాకు సౌదీ అరేబియా దీపావళి గిఫ్ట్ ఇఛ్చినట్టే భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా పీఓకే యాక్టివిస్ట్ ఒకరు కూడా ఇలాగే ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com