ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్

- October 29, 2020 , by Maagulf
ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్

విజయవాడ:ముహమ్మద్ ప్రవక్త జన్మ దినం నేపధ్యంలో ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్  బిశ్వ భూషణ్ హరి చందన్   “ఈద్ మిలాద్-ఉన్-నబీ” శుభాకాంక్షలు తెలియ చేసారు. ప్రవక్త యొక్క జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మం గురించి వివరిస్తుందన్నారు. ప్రవక్త పుట్టినరోజు అందరిలో శాంతి, సౌహార్దాలను తీసుకు రావాలని హరి చందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com