ఫేస్ మాస్క్ ధరించకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
- October 29, 2020
మనామా:కరోనా సోకకుండా ఫేస్ మాస్క్ పెట్టుకోలేదు..పైగా ఫైన్ వేసిన పోలీసులనే కించపరిచేలా వ్యవహరించాడో వ్యక్తి. దీంతో అతనికి ఏడాది జైలు శిక్ష పడింది. నార్తర్న్ బహ్రెయిన్ లోని అల్ ముహర్రఖ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు విధిగా ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానా విధిస్తామని ఇదివరకే హెచ్చరించింది. అయితే...నిందితుడు మాత్రం కోవిడ్ నిబంధనలను లెక్క చేయలేదు. మాస్క్ పెట్టుకోకుండా ఫ్రెండ్స్ కలిసి పబ్లిక్ ప్లేసులో చిట్ చాట్ చేస్తుండటంతో పోలీసులు అతన్ని వారించారు. మాస్క్ పెట్టుకోనందుకు అతనికి ఫైన్ విధించారు. అయితే..నిందితుడు మాత్రం ఫైన్ కట్టకుండా...పోలీసులను కించపరిచేలా వ్యవహరించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టు బోనులో నిలబెట్టారు పోలీసులు. విచారణ చేపట్టిన మైనర్ క్రిమినల్ కోర్టు నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు..1000 దినార్ల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







