ఫేస్ మాస్క్ ధరించకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
- October 29, 2020
మనామా:కరోనా సోకకుండా ఫేస్ మాస్క్ పెట్టుకోలేదు..పైగా ఫైన్ వేసిన పోలీసులనే కించపరిచేలా వ్యవహరించాడో వ్యక్తి. దీంతో అతనికి ఏడాది జైలు శిక్ష పడింది. నార్తర్న్ బహ్రెయిన్ లోని అల్ ముహర్రఖ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు విధిగా ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానా విధిస్తామని ఇదివరకే హెచ్చరించింది. అయితే...నిందితుడు మాత్రం కోవిడ్ నిబంధనలను లెక్క చేయలేదు. మాస్క్ పెట్టుకోకుండా ఫ్రెండ్స్ కలిసి పబ్లిక్ ప్లేసులో చిట్ చాట్ చేస్తుండటంతో పోలీసులు అతన్ని వారించారు. మాస్క్ పెట్టుకోనందుకు అతనికి ఫైన్ విధించారు. అయితే..నిందితుడు మాత్రం ఫైన్ కట్టకుండా...పోలీసులను కించపరిచేలా వ్యవహరించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టు బోనులో నిలబెట్టారు పోలీసులు. విచారణ చేపట్టిన మైనర్ క్రిమినల్ కోర్టు నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు..1000 దినార్ల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







