భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం

- October 31, 2020 , by Maagulf
భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేల లోపు కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,268 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన బారినపడ్డారు. అలాగే ఈ మహమ్మారి కారణంగా నిన్న 551 మంది ప్రాణాలు కోల్పోయారు. 

నిన్న 59,454 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రికవరీ రేటు 90.23కి చేరింది. దేశవ్యాప్తంగా 81,37,119 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారిలో 1,21,641 మంది ప్రాణాలు కోల్పోయారు. 74,32,829 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,82,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com