పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉన్నవారికే ఒమన్ లోకి అనుమతి-సుప్రీం కమిటీ
- November 02, 2020
మస్కట్:ఇతర దేశాల నుంచి ఒమన్ వచ్చే వాళ్లందరూ ముందుగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని..టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ ఉన్నవాళ్లనే సుల్తానేట్ లోకి అనుమతించాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ దేశాలను కోవిడ్ 19 సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒమన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సమావేశం అయ్యింది. ప్రస్తుతం సుల్తానేట్ లో కోవిడ్ తీవ్రత ఎలా ఉంది..సేకండ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి విధానాలు అవలంభించాలో సుప్రీం కమిటీ పేపర్ ప్రజంటెషన్ ద్వారా వివరించింది. సరిహద్దులు దాటి ఒమన్ లోకి వచ్చే వాళ్లందరూ ముందుగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ప్రతిపాదించింది. దీనికి అంతర్గత మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. ప్రయాణానికి 96 గంటల లోపు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని తమకు కోవిడ్ లేదని సర్టిఫై అయిన వారికి మాత్రమే ఇక ఎంట్రీ ఉంటుంది. ఒమన్ చేరుకున్నాక కూడా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆ తర్వాత వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఎనిమిదో రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!