రియల్ ఎస్టేట్ రంగానికి ఒమన్ ప్రభుత్వం ఊరట.. 3 శాతానికి ఫీజుల తగ్గింపు
- November 02, 2020
ఒమాన్: దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలా ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించి జరిగే క్రయ విక్రయాలపై ఫీజును 3 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపింది. 2020-24 మిడ్ టర్మ్ ఆర్ధిక ప్రణాళికలో భాగంగా ఈ సవరణలు చేసినట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. కరోనా తర్వాత సంక్షోభం ఎదుర్కొంటున్న రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఉంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ఫీజులను తగ్గిస్తూ ఒమన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియాలిటీ రంగానికి కొద్దిమేర ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి. గృహనిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ అవలంభించనున్న రియల్ ఎస్టేట్ సవరణల ప్రకారం..రియల్ ఎస్టేట్ ఫీజు ట్రాన్సాక్షన్ 5 నుంచి 3 శాతానికి తగ్గనుంది. లీజ్ కు సంబంధించిన లైసెన్స్ రుసుము వాయిదాల ద్వారా చెల్లించవచ్చు. నిర్దేశిత ఫీజు చెల్లించి భవనం అంతస్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో ఒమనీయేతరులు కూడా బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







