పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో 120 మంది ప్రవాసీయులపై వేటు
- November 02, 2020
కువైట్: కువైటీయన్లకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆ దేశం అనుసరిస్తున్న విధానాలు..ప్రవాసీయుల పాలిట శాపంగా మారాయి. కువైటేజేషన్ పాలసీ ప్రభావంతో ఇప్పటికే చాలా మంది ప్రవాసీయులు కువైట్ లో ఉపాధి కొల్పొయి దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో కూడా ప్రవాసీయుల తొలగింపు ప్రక్రియ జోరందుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మినిస్ట్రిలో ఉద్యోగం చేస్తున్న 120 మంది ప్రవాసీయులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ 120 మంది ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమైంది. సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో వాళ్లందర్ని విధుల నుంచి తొలగించనున్నారు. తొలిగించిన 120 మంది ప్రవాసీయుల స్థానంలో కువైటీయన్లకు అవకాశం కల్పించనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు