దానంతట అదే మాయం..వాట్సప్లో కొత్త ఫీచర్
- November 02, 2020
ఫేస్బుక్ కొనుక్కున్నాక వాట్సాప్ రోజు రోజుకూ సరికొత్త అప్డేట్స్ తో యూజర్లఇన్ థ్రిల్ చేస్తోంది. ప్రస్తుతం మనం వాట్సప్ లో అందుబాటులో ఉన్న ఫీచర్ ప్రకారం పొరపాటున అవతలి వ్యక్తికి పంపిన వీడియోలను, మెసేజెస్, ఇమేజెస్, ఫైల్స్, ఎమోజీలను కొంత సమయంలోపు అవతలి వ్యక్తికి కూడా కనిపించకుండా డిలీట్ చేసే అవకాశం ఉంది. నిర్ణీత సమయం తర్వాత 'డిలీట్ ఫర్ ఆల్' ఆప్షన్ పనిచేయదు. దీన్ని అధిగమించడానికి మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తుంది. ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకుంటే ఇక నుంచి మీకు వచ్చిన పర్సనల్ మెసేజెస్, గ్రూప్స్ మెసేజెస్ ఏడు రోజుల వరకే కన్పిస్తాయి.
ఆ తర్వాత ఆయా మెసేజెస్ వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. దీనికి సంబంధించిన నూతన మెసేజ్ ఫీచర్ను అధికారికంగా ధృవీకరించింది వాట్సాప్. ఈ నూతన మెసేజింగ్ ఫీచర్ను వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, కైయోస్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంచనుంది. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులో రానున్న విషయాన్ని మాత్రం వాట్సాప్ స్పష్టత నివ్వలేదు. అయితే, ఈ కొత్త ఫీచర్తో మీకు వచ్చిన మెసేజెస్ను ఇతరులకు ఫార్వార్డ్ కనుక చేస్తే అటువంటి మెసేజెస్ మాత్రం అదృశ్యం కావని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు