కువైట్ ను వణికిస్తున్న వైరస్..కొత్తగా 787 కరోనా కేసులు నమోదు
- November 03, 2020
కువైట్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలకు సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో..కువైట్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 787 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,28,080కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందటంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 789కి పెరిగింది. అయితే..కరోనా కేసుల తీవ్రతతో పాటు...రికవరి రేటు కూడా పెరుగుతుండటం కొంత మేర ఆశాజనకంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 694 మంది కోలుకున్నారు. ఓవరాల్ గా ఇప్పటివరకు 1,19.080 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 8,211 కరోనా పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు