కువైట్ ను వణికిస్తున్న వైరస్..కొత్తగా 787 కరోనా కేసులు నమోదు

- November 03, 2020 , by Maagulf
కువైట్ ను వణికిస్తున్న వైరస్..కొత్తగా 787 కరోనా కేసులు నమోదు

కువైట్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలకు సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో..కువైట్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 787 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,28,080కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందటంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 789కి పెరిగింది. అయితే..కరోనా కేసుల తీవ్రతతో పాటు...రికవరి రేటు కూడా పెరుగుతుండటం కొంత మేర ఆశాజనకంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 694 మంది కోలుకున్నారు. ఓవరాల్ గా ఇప్పటివరకు 1,19.080 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 8,211 కరోనా పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com