అర్నబ్ గోస్వామి అరెస్టు...

- November 04, 2020 , by Maagulf
అర్నబ్ గోస్వామి అరెస్టు...

ప్రముఖ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు (బుధవారం) ఉదయం అర్నబ్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఒక ఆత్మహత్య కేసుకు సంబంధించిన విషయంపై ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. గత కొద్దికాలంగా అర్నబ్, మహారాష్ట్ర ప్రభుత్వంపై, ముంబయి పోలీసులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత విమర్శల వేగం పెంచాడు. ఆయన ఛానెల్ లో ప్రతిరోజు దీనిపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

కాగా ఆత్మహత్య (సుశాంత్ ది కాదు) కేసుకు సంబంధించి మరింత విచారణ నిమిత్తమే ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం ఆయనను రాయ్గడ్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తున్నది. అక్కడే ఆయనను విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు పది మందికి పైగా అర్నబ్ ఇంటికి వచ్చిన పోలీసులు.. ఆయనన అదుపులోకి తీసుకున్నారు.సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు తర్వాత.. ముంబయి పోలీసులపై..

బాలీవుడ్ పై.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆయన వరుసగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అర్నబ్ పెద్ద టీఆర్పీ కుంభకోణానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠీ ఛానెల్స్ పైనా కేసు నమోదైంది. పలువురికి డబ్బులిచ్చి మరీ టీఆర్పీలు పెంచుకుంటున్నారని రిపబ్లిక్ టీవీపై ఆరోపణలు నమోదైన విషయంవిదితమే. అయితే పోలీసులు తాజాగా అర్నబ్ ను పాత కేసులో అరెస్టు చేసినా.. తర్వాత దీనిని కూడా ముందుకు తీసుకొస్తారనే గుసగుసలు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com