ఆపరేషన్ ముస్కాన్ పై వెబినార్..పాల్గొన్నహోం మంత్రి, డీజీపీ గౌతమ్
- November 04, 2020
గుంటూరు: ఆపరేషన్ ముస్కాన్ పై నిర్వహించిన వెబినార్ లో హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాoగ్ లు పాల్గొన్నారు. వారితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అనురాధ, కృత్తికా శుక్లా, దీపికా పాటిల్, పోలీస్ అధికారులు, అన్ని జిల్లాల నుండి న్యాయ, కార్మిక శాఖ, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా బాలల కార్మికుల విముక్తి కోసం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వినూత్న రీతిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో జరుపుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు జరిపిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను విభిన్నంగా నిర్వహించారు. వారోత్సవాలుతోపాటు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. 10 రోజుల పాటు చేపట్టిన ఈ ఆపరేషన్ ముస్కాన్ లో 16 వేల మంది బాల బాలికలను గుర్తించి సంరక్షించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని కార్యక్రమాలు బాలలకు అందించాలని హోంమంత్రి సుచరిత అన్నారు. బాలల సంరక్షణ కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. నేటి బాలలు రేపటి పౌరులు అనేది పాత నినాదమని...నేటి వీధి బాలలే రేపటి ఉన్నత విద్యావంతులు అన్నది నేటి విధానమని సురచరిత అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జునైల్ జస్టిస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన