ఖతార్‌లో కొత్తగా 227 కోవిడ్‌ 19 కేసులు

- November 04, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 227 కోవిడ్‌ 19 కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,414 గా నమోదైంది. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 192 కేసుల్ని కమ్యూనిటీ కేసులుగా గుర్తించారు. 35 మంది విదేశాల నుంచి వచ్చారు. మరోపక్క, దేశంలో మొత్తంగా ఇప్పటివరకు 232 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 2467 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు దేశంలో 995,459 పరీక్షలు నిర్వహించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com