చింత చిగురు బిర్యాని
- February 15, 2016
కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - ఒకటిన్నర కప్పులు, చింతచిగురు - అరకప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 5, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 6 రేకలు, పచ్చికొబ్బరి ముక్క - పావు చిప్ప, సోంపు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, మసాలా దినుసులు (లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యాని ఆకు) - తగినన్ని.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చిగురుని టీ స్పూను నూనెలో దోరగా వేగించి, కొద్ది నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి. మిక్సీలో పావుకప్పు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, సోంపు, అర టీ స్పూను జీలకర్ర మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో మసాలా దినుసులు, మిగిలిన జీలకర్ర, ఉల్లి తరుగు, ఉల్లి మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఉల్లి ముద్ద పచ్చివాసన పోయాక చింతచిగురు కలపాలి. రెండు నిమిషాల తర్వాత (3 గంటలు నానబెట్టిన) బియ్యం కలిపి రెండున్నర కప్పుల నీరు పోసి ఉడికించాలి. అన్నంతో కలిసిన చింతచిగురు రుచికరమైన బిర్యానిగా సిద్ధమపోతుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









