చింత చిగురు బిర్యాని
- February 15, 2016
కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - ఒకటిన్నర కప్పులు, చింతచిగురు - అరకప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 5, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 6 రేకలు, పచ్చికొబ్బరి ముక్క - పావు చిప్ప, సోంపు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, మసాలా దినుసులు (లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యాని ఆకు) - తగినన్ని.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చిగురుని టీ స్పూను నూనెలో దోరగా వేగించి, కొద్ది నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి. మిక్సీలో పావుకప్పు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, సోంపు, అర టీ స్పూను జీలకర్ర మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో మసాలా దినుసులు, మిగిలిన జీలకర్ర, ఉల్లి తరుగు, ఉల్లి మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఉల్లి ముద్ద పచ్చివాసన పోయాక చింతచిగురు కలపాలి. రెండు నిమిషాల తర్వాత (3 గంటలు నానబెట్టిన) బియ్యం కలిపి రెండున్నర కప్పుల నీరు పోసి ఉడికించాలి. అన్నంతో కలిసిన చింతచిగురు రుచికరమైన బిర్యానిగా సిద్ధమపోతుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







