తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు
- November 05, 2020
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసుల వివరాలను ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,539 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 978 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,25,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1362కి చేరింది. ప్రస్తుతం 18,656 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,864 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 285 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 123 కేసులు నిర్ధారణ అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









