ఏపి:నేడు మంత్రివర్గం సమావేశం
- November 05, 2020
అమరావతి: ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో ఏపి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. వాస్తవానికి ఈ సమావేశం నాలుగో తేదీనే జరగాల్సి వుండగా, ఐదో తేదీకి వాయిదా వేస్తున్నట్టు నిన్ననే ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఈమధ్య కాలంలో మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించడం, ఆపై వాయిదా వేయడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలలో ఒకటి, మూడవ బుధవారాల్లో మంత్రులతో సమావేశం అవనున్నట్టు జగన్ ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, అనివార్య కారణాలతో ఈ షెడ్యూల్ అమలు కాలేదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







