పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక..
- November 05, 2020
భారత్: ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ సబ్స్ర్కైబర్లకు గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతోంది. పండగ సీజన్లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ రేటు అందిస్తామని ఈపీఎఫ్వో గతంలోనే ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకే సారి కాకుండా రెండు విడతలుగా జమ చేయాలనుకుంటోంది ఈపీఎఫ్. అందులో భాగంగానే మొదటి విడత నగదును దీపావళి నాటికి వారి అకౌంట్లలో జమచేయనుంది. మిగిలిన మొత్తాన్ని డిసెంబర్ చివరి నాటికి పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. ఇక ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చూసుకునేందుకు పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్వో వెబ్సైట్కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత పాస్బుక్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు