'ఫ్రీడమ్‌ 251' స్మార్ట్‌ఫోన్‌ను రూ.500

- February 15, 2016 , by Maagulf
'ఫ్రీడమ్‌ 251' స్మార్ట్‌ఫోన్‌ను రూ.500

దేశంలోనే చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ రింగింగ్‌ బెల్స్‌ రేపు విడుదల చేయనుంది. 'ఫ్రీడమ్‌ 251' స్మార్ట్‌ఫోన్‌ను రూ.500 కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ రేపు విడుదల చేయనున్నారు. తయారీ, ఉత్పత్తులు, ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇటీవలే రూ.2,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో రెండు ఫీచర్‌ మొబైళ్లను సైతం రింగింగ్‌ బెల్స్‌ విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com