చాక్టెట్ కవర్లలో బంగారం..కోల్ కతా కస్టమ్స్ ఆఫీసర్లకు దొరికిపోయిన ప్రయాణికుడు
- November 06, 2020
కోల్ కతా:పలు దేశాల నుంచి భారత్ లోని వివిధ విమనాశ్రాయాల ద్వారా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇప్పటికే చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే..దక్షిణాది రాష్ట్రలకు చెందిన విమానాశ్రయాల్లోనే బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తు పట్టుబడిన ఘటనలు బయటపడ్డాయి. లేటెస్ట్ కోల్ కతాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో చాక్లెట్ కవర్లలో దాచిపెట్టి ఉంచి 531.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ. 27,62,240 ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం కలిగి ఉన్న ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే..ఆ ప్రయాణికుడు ఎక్కడి నుంచి కోల్ కతాకు చేరుకున్నాడనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.

తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







