ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ తో జనవరి నుంచి ఆర్ కె ఇంటెర్నేషనల్ చిత్రం 'కలియుగం'
- November 06, 2020
హైదరాబాద్:హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలో తన స్పెల్-బైండింగ్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్, ప్రస్తుతం "కలియుగం" అనే తెలుగు, తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ "నేను కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలనీ ,అంత గొప్ప కథ ఇది అని, నాలాంటి ఒక నటికీ ఇలాంటి పాత్ర పోషించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని, అంతేకాక ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక ఫ్రెష్ కథతో ఒక గొప్ప సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను "ఆర్ కె ఇంటెర్నేషనల్" బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మిగతా నటీనటులు టెక్నీకల్ టీమ్ విషయాలు అతి త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపారు.
తాజా వార్తలు
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!









