కోవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే హజ్ యాత్ర!
- November 08, 2020
న్యూ ఢిల్లీ:కరోనా విజృంభణ వేళ హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.2021లో సౌదీ అరేబియాలోని హజ్కు వెళ్లే యాత్రికులు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సిందేనని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టంచేశారు.
యాత్ర బయల్దేరే వాళ్లంతా ఈ రిపోర్టులను సమర్పించాలని స్పష్టం చేశారు.హజ్ కమిటీ, సంబంధిత సంస్థలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.హజ్కు వెళ్లాలనుకునే వారు డిసెంబర్ 10లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో, హజ్ మొబైల్ యాప్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
RT-PCR పరీక్ష చేయించి విమానం ఎక్కడానికి 72గంటల ముందు తేదీతో ఉన్న రిపోర్టును సమర్పించాలని స్పష్టంచేశారు.కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలోనే దీన్ని తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతంలో దేశంలోని 21 చోట్ల నుంచి హజ్ యాత్ర ప్రారంభం కాగా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దీన్ని 10 ప్రాంతాలకు కుదించినట్టు చెప్పారు.
ఎయిరిండియా, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







