ఒమన్ నుంచి విమానాలను రద్దు చేసిన ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్
- November 08, 2020
మస్కట్:విమాన సర్వీసులకు సంబంధించి భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని సవరించటంతో ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒమన్ నుంచి భారత్ కు సర్వీసులు నడిపించిన గోఎయిర్, ఇండిగో ఎయిర్ లైన్స్ ఇక తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు తాము ఈ డిసిషన్ తీసుకున్నట్లు వెల్లడించాయి. అయితే..ఆదివారం రోజున మాత్రం షెడ్యూల్ ప్రకారమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఒమన్ నుంచి భారత్ వెళ్లాలనుకునే ప్రయాణికులు..తమ ప్రయాణ తేదిని నవంబర్ 7, 8 తేదిలకు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ప్రయాణ తేదీలను ఆయా తేదీలకు ప్రీపోన్ చేసుకునేందుకు వీలుగా ఎలాంటి రీషెడ్యూల్ చార్జీలు వసూలు చేయబోమని కూడా ఇండిగో వెల్లడించింది. అయితే..సీట్ల లభ్యతను బట్టి ముందుగా వచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఒకవేళ నవంబర్ 7, 8 తేదీల్లో ప్రయాణానికి సంబంధించి టికెట్లు రీషెడ్యూల్ చేయలేకపోతే వారికి ఛార్జీ డబ్బులను మొత్తం తిరిగి చెల్లించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. మరోవైపు గోఎయిర్ కూడా సీట్ల లభ్యతను బట్టి ప్రయాణికులు 7, 8 తేదిన టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







