ఒమన్ నుంచి విమానాలను రద్దు చేసిన ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్
- November 08, 2020
మస్కట్:విమాన సర్వీసులకు సంబంధించి భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని సవరించటంతో ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒమన్ నుంచి భారత్ కు సర్వీసులు నడిపించిన గోఎయిర్, ఇండిగో ఎయిర్ లైన్స్ ఇక తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు తాము ఈ డిసిషన్ తీసుకున్నట్లు వెల్లడించాయి. అయితే..ఆదివారం రోజున మాత్రం షెడ్యూల్ ప్రకారమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఒమన్ నుంచి భారత్ వెళ్లాలనుకునే ప్రయాణికులు..తమ ప్రయాణ తేదిని నవంబర్ 7, 8 తేదిలకు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ప్రయాణ తేదీలను ఆయా తేదీలకు ప్రీపోన్ చేసుకునేందుకు వీలుగా ఎలాంటి రీషెడ్యూల్ చార్జీలు వసూలు చేయబోమని కూడా ఇండిగో వెల్లడించింది. అయితే..సీట్ల లభ్యతను బట్టి ముందుగా వచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఒకవేళ నవంబర్ 7, 8 తేదీల్లో ప్రయాణానికి సంబంధించి టికెట్లు రీషెడ్యూల్ చేయలేకపోతే వారికి ఛార్జీ డబ్బులను మొత్తం తిరిగి చెల్లించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. మరోవైపు గోఎయిర్ కూడా సీట్ల లభ్యతను బట్టి ప్రయాణికులు 7, 8 తేదిన టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







